ఖమ్మం : చింతకాని మండలం నామవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్ పెట్టారు. డీజే సౌండ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక వర్గానికి చెందిన వారు.. మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.