జగిత్యాల : జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడి కొత్త షాపు వద్ద ఫ్లెక్సీ బోర్డు పెడుతుండగా.. ప్రమాదవశాత్తూ ఇద్దరు విద్యుత్ షాక్కు గురయ్యారు. మృతులను కనక వికాస్(25), బైండ్ల వినీత్(24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులను ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.