Tripura : త్రిపుర పోలీసులు రాష్ట్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. మంగళవారం పోలీసుల దాడిలో పట్టుబడ్డ ముఠా సభ్యుడి నుంచి 186 కిలోల గంజాయి సీజ్ చేశారు. దొరికినగంజాయి విలువ దాదాపు రూ.9 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు.
గంజాయి ముఠాకు సంబంధించిన పక్కా సమాచారంతో హెజమర గ్రామంపై ఈరోజు పోలీసులు దాడి చేశారు. గంజాయి తరలిస్తున్న కొనబన్ గ్రామానికి చెందిన అమలేష్ పాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 186 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిధాయ్ పోలీసులు, 29వ బెటాలియన్కు చెందిన అస్సాం రైఫిల్స్ సభ్యులు కలిసి ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టారు. పట్టుబడ్డ గంజాయి, అరెస్ట్ అయిన వ్యక్తి ఫొటోల్ని త్రిపుర పశ్చిమ జిల్లాకు చెందిన పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Based on a specific input a joint raid was carried out by Sidhai PS along with 29 BN Assam Rifles at Hezamara and recovered approx. 186 kg semi dry ganja (worth Rs.9 lakhs) and arrested one Amalesh Pal of Kunaban, PS-Madhupur. An investigation under NDPS Act has been initiated. pic.twitter.com/xQcC3YzWRl
— West Tripura District Police (@spwest_police) November 22, 2022