కావలసిన పదార్థాలు
పనస తొనలు: పది, పాలు: అర లీటర్, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, డ్రైఫ్రూట్స్(బాదం, జీడిపప్పు, కిస్మిస్): పావు కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
పనస తొనల్ని గింజలు తీసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్మీద గిన్నెపెట్టి నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేయించి పక్కనపెట్టాలి. అదే గిన్నెలో పనస తొనల మిశ్రమం వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. పచ్చివాసన పోయి నెయ్యి పైకి తేలుతుండగా పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి దగ్గరపడేవరకు ఉడికించాలి. చివరగా డ్రైఫ్రూట్స్ వేసుకుంటే ఘుమఘుమలాడే పనస పాయసం సిద్ధం. ఇష్టపడేవాళ్లు నేతిలో వేయించిన కొబ్బరి కూడా జతచేసుకోవచ్చు.