Zombie reddy | బాలనటుడిగా కెరీర్ను మొదలుపెట్టి పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజసజ్జా. సమంతతో ఓ బేబి చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా మెయిన్లీడ్ లో నటించిన చిత్రం జాంబీరెడ్డి. యాపిల్ స్టూడియోస్ బ్యానర్పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఒక సైంటిస్ట్ ఎక్స్పరిమెంట్ ఫేయిల్ అవడం వలన ఒక వైరస్ క్రియేట్ అవ్వడం..ఆ వైరస్ జాంబీలు అవడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? జాంబీలు అంతమౌతారా? లేదా అనేది చిత్ర సారాంశం.కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరెకక్కిన ఈ చిత్రంలో ఆనంది, దక్షనగర్కర్లు హీరోయిన్లుగా నటించారు. గతేడాది ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం నేటితో సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండే పాజిటీవ్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించింది. ఫైనల్గా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లను ఒక సారి గమనిస్తే
నైజాం : 1.98 కోట్లు
సీడెడ్ : 1.16 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.69 కోట్లు
ఈస్ట్ : 0.51 కోట్లు
వెస్ట్ : 0.39 కోట్లు
గుంటూరు : 0.52 కోట్లు
కృష్ణా : 0.52 కోట్లు
నెల్లూరు : 0.33 కోట్లు
ఏపి+తెలంగాణ : 6.10 కోట్లు
ఓవర్సీస్ : 0.22 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.33 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ : 6.65 కోట్లు
జాంబీ రెడ్డి చిత్రానికి 4.5 కోట్ల బిజినెస్ జరిగింది. 5 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి 6.65 కోట్ల కలెక్షన్లను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం యూట్యుబ్లో హింది వెర్షన్కు 5 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇదే కాంబోలో హనుమాన్ అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతుంది.