Shekar Chandra | యువ సంగీత దర్శకుడు శేఖర్చంద్ర స్వరపరిచిన తాజా పాట ‘నిజమే నే చెబుతున్నా’ యూట్యూబ్లో మూడు కోట్ల వ్యూస్ను దాటి అందర్ని అలరిస్తున్నది. సందీప్కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం కోసం శేఖర్ చంద్ర ఈ పాటను కంపోజ్ చేశారు.
శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్శ్రీరామ్ ఆలపించారు. ఈ సందర్భంగా శేఖర్చంద్ర మాట్లాడుతూ ‘సిద్శ్రీరామ్, నా కలయికలో వచ్చిన నాలుగో పాట ఇది. ప్రస్తుతం ఈ పాట సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది. మా కాంబినేషన్లో భవిష్యత్లో మరిన్ని మంచి పాటలు వస్తాయనే విశ్వాసం వుంది’ అన్నారు.