దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందించిన ‘యాత్ర’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు కొనసాగింపుగా ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కీలక రాజకీయ సంఘటనలను ఆవిష్కరిస్తూ ‘యాత్ర-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకుడు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించనున్నారు. ఇటీవల స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. వై.యస్.జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నామని, ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.