Yatra 2 | 2019లో ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి (YS. Rajashekar) స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 (Yatra 2) వస్తుందని తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. యాత్ర 2 ఫస్ట్ లుక్ను అక్టోబర్ 09 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనితో పాటు ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ”నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్రెడ్డి కొడుకుని” అంటూ పోస్టర్లో రాసుకోచ్చారు. ఇక ఈ పోస్టర్లో ఒకవైపు జీవా ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు.
#YATRA2 – FIRST LOOK – MONDAY pic.twitter.com/ck5cMIKurH
— Aakashavaani (@TheAakashavaani) October 7, 2023
ఇదిలా ఉండగా.. యాత్ర ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.