యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘చిత్తం మహారాణి’.లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో జేఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టీఆర్ నిర్మిస్తున్నారు.. ఏ. కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత జేఎస్ మణికంఠ మాట్లాడుతూ..‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా మా చిత్రాన్ని నిర్మించాం. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. గతంలో దర్శకుడు సుకుమార్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, నాయిక రష్మిక మందన్న రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్కు మంచి స్పందన వస్తున్నది’ అన్నారు. తులసి, మధునందన్, సత్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.