అనిరుధ్, యశస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘యాద్గిరి అండ్ సన్స్’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మిస్తున్నారు. రాజు పందిరి దర్శకుడు. వాస్తవ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను దర్శకుడు సాగర్ కె చంద్ర విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…‘కథ నేపథ్యం తెలుసుకున్నాక ఆశ్చర్యం కలిగింది. చిత్రబృందం ఒక మంచి ప్రయత్నం చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంది’ అన్నారు. హీరో అనిరుధ్ మాట్లాడుతూ..‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాతో హీరోగా మీ ముందుకొస్తున్నాను. అన్ని రకాల భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. సినిమా చూసి బయటకు వచ్చాక ఒక మంచి చిత్రాన్ని చూశామనే అనుభూతి కలుగుతుంది’ అన్నారు.