‘118’ చిత్రంతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మిస్టరీ థ్రిల్లర్ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా.రవి పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్లో గ్రాండ్గా విడుదలకానుంది. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన ప్రముఖ నిర్మాత సురేష్బాబు మాట్లాడుతూ ‘ ఇటీవల ఈ సినిమా చూశాను. నటీనటుల చక్కని నటనతో దర్శకుడు చాలా థ్రిల్లింగ్గా తెరకెక్కించాడు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్లో వచ్చిన మార్పులని ఆసక్తికరంగా చూపించారు. అంతర్లీనంగా వుండే ప్రేమకథ కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్స్లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా వుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రియదర్శి, వైవాహర్ష, దివ్య, రియాజ్ఖాన్, సత్యం రాజేష్ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్.కె.కింగ్.