2018 Movie | ఈ ఏడాది ఓ మోస్తరు అంచనాలతో విడుదలై సెన్సేషనల్ కలెక్షన్లు సాధించిన సినిమా 2018. మలయాళంలో రిలీజై రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదల (Kerala Floods) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో కూడా విడుదలై మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ను లాక్ చేసుకుంది.
మే 05న విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన టీవీలో మాత్రం విడుదల కాలేదు. అయితే ఈ సినిమా టీవీ ప్రీమియర్పై తాజా అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 10న ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ మా (Star Maa) ఛానెల్లో 2018 మూవీ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. టోవినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
World Television Premiere#2018Movie
Tomorrow at 6pm on #StarMaa#TovinoThomas #VineethSeenivasan#KunchackoBoban #AsifAli #AparnaBalamuralipic.twitter.com/JteWAd0Yjv— Telugu Television News (@TeluguTvExpress) September 9, 2023
ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న టోవినో థామస్. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించే జర్నలిస్ట్ అపర్ణ బాలమురళి. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్న మత్య్సకార కుటుంబానికి చెందిన అసీఫ్అలీ. ప్రభుత్య కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్. కేరళ సరిహద్దుల్లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ కలైయారస్ టూరిస్ట్లకి గైడ్గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అజు వర్ఘీస్. ఇలా ఎవరి జీవితాల్లో వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలా జీవితాన్ని కొనసాగిస్తన్న వీళ్ల లైఫ్లోకి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంటుంది. అదే కేరళ వరదలు. ఆ సమయంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడారు అనే కథాంశంతో ఈసినిమా తెరకెక్కింది.