అరుణ్విజయ్, ప్రియా భవానీశంకర్, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏనుగు’. హరి దర్శకత్వంలో సీ.హెచ్.సతీష్కుమార్ నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కమర్షియల్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కుటుంబ ప్రేక్షకులందరూ చూసే విధంగా ఉంటుంది. సమకాలీన సమస్యల్ని వినోదాత్మక కోణంలో ఆవిష్కరించాం. అంతర్లీనంగా చక్కటి సందేశం కూడా ఉంటుంది’ అని చెప్పారు. ‘తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతున్నది. చక్కటి కుటుంబ విలువలతో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. జీవీ ప్రకాష్కుమార్ అందించిన సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని హీరో అరుణ్ విజయ్ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘తమిళంలో ‘యానై’ పేరుతో విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలుంటాయి’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించే చిత్రమిదని, భావోద్వేగాలు కదిలిస్తాయని నటుడు సముద్రఖని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూని ట్ సభ్యులందరూ పాల్గొన్నారు.