క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్యగౌడ, సుచంద్ర ప్రసాద్ః ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘రేవ్ పార్టీ’. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. దర్శక నిర్మాత రాజు మాట్లాడుతూ “రేవ్పార్టీల వెనుక ఎవరెవరు వుంటారు? వాటి వల్ల యువతకు జరిగే నష్టమేమిటి అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపెడుతున్నాం.
నేటి యువతరం నచ్చే అంశాలతో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. మైసూర్, ఉడిపి, బెంగళూరు,మంగళూరులో చిత్రీకరణ చేశాం. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తన్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి.