తిరుమల: చాలా విషయాల్లో బైలాస్ మారుస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు కౌంటింగ్ కొనసాగించారని, అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు.
పెద్దల అంగీకారంతో చాలా విషయాల్లో బైలాస్ మారుస్తామని, జనరల్ బాడీ మీటింగ్లో ఈ ప్రపోజల్ పెడతామన్నారు. ‘మా’ సభ్యత్వాన్ని స్ర్టిక్ట్ చేయాలని, ఎవరు పడితే వాళ్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కాకుండా చర్యలు తీసుకుంటాని చెప్పారు.