గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల జోరు చూస్తున్నాం. ప్రాంతీయ సినిమా దేశీయంగా పైచేయి సాధిస్తున్నది. విజయాల జెండా ఎగరేస్తున్నది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఉత్తరాది బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం ప్రదర్శించడమే కాదు విరివిగా హిందీలోకి రీమేక్ అవుతున్నాయి. ప్రాంతీయ సినిమా జోరుకు బాలీవుడ్ బేజారు అవుతున్నది. అక్కడి సినీ ప్రముఖులను అంతర్మథనంలో పడేస్తున్నది. ఈ ట్రెండ్పై స్పందించారు హిందీ సెలబ్రిటీలు. తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
బాలీవుడ్లో మూసధోరణి కొనసాగుతున్నది. బయోపిక్స్ హిట్ అయితే అంతా ఆ తరహా చిత్రాలనే రూపొందిస్తాం. సందేశాత్మక చిత్రాలు విజయం సాధిస్తే అవే. నాతో సహా దర్శకనిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగు సినిమా హాలీవుడ్లో, బాలీవుడ్లో ఏం చేస్తున్నారని ఆలోచించడం లేదు. తమ సొంత ఆలోచనలతో కొత్త తరహా చిత్రాలను రూపొందిస్తున్నది. అందుకే ‘పుష్ప’,‘ఆర్ఆర్ఆర్’,‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలు బాలీవుడ్లో గొప్ప విజయాలు సాధించాయి.
దక్షిణాది సినిమాతో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. వాళ్లు తమ స్థానికతను మర్చిపోరు. అలాగే వాళ్ల సంసృతీ సంప్రదాయాలు, మూలాలను విడిచిపెట్టరు. వీటితో పాటు సినిమా కథల్లో భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆ ఎమోషన్స్ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భావోద్వేగాలే సినిమాకు ముఖ్యమనే విషయం బాలీవుడ్ మర్చిపోతున్నది. హిందీ సినిమా ఎప్పుడూ హాలీవుడ్ ను అనుకరించేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నది.
హిందీ సినిమాలకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రాంతీయ సినిమాలకూ మన దగ్గర ఘన చరిత్ర ఉంది. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే ఇటీవల పాన్ ఇండియా చిత్రాల సంఖ్య పెరిగింది. అదీ కొత్తగా వచ్చిన మార్పు. ఓ గొప్ప సినిమా ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు రీమేక్గా వెళ్తుంది. ఏ సినిమా చేసినా మనమంతా చిత్ర పరిశ్రమలో భాగమేనని భావించాలి.
దశాబ్దాలుగా ప్రాంతీయ సినిమాను బాలీవుడ్ అణచివేసింది. దక్షిణాది హీరోలకు అపార ప్రతిభ, స్టార్డమ్ ఉన్నా హిందీ చిత్ర పరిశ్రమ వారిని ఇక్కడ అడుగుపెట్టనివ్వలేదు. ఆ లోటును ఇప్పుడు వారు తీర్చుకుంటున్నారు. మన బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తున్నారు. ప్రాంతీయ సినిమాకు ఎప్పుడో దక్కాల్సిన గౌరవం ఇది.
పాన్ ఇండియా చిత్రాల జోరు పెరిగిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. దక్షిణాది సినీ ప్రతిభను ప్రపంచానికి మరింతగా చూపించాలంటే దర్శకనిర్మాతలు స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలివ్వాలి. నా దృష్టిలో ఇండియాకు నార్త్ , సౌత్ అనే బేధాలు ఉండొద్దు. భారత్ ఒక్కటే. కళ ద్వారా ప్రజల్ని ఏకం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ శక్తి సినిమాలకు ఉంది.
బాలీవుడ్ సినిమా మర్చిపోతున్న తన మూలాలను వెతుకోవాలి. ‘షోలే’,‘జంజీర్’, నేను నటించిన ‘వాస్తవ్’, ‘ఖల్ నాయక్’ లాంటి మాస్ ఎంటర్టైనర్స్ రూపొందించాలి. హీరోయిజం, యాక్షన్లది ఎవర్ గ్రీన్ ఫార్ములా. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్స్ అన్నీ ఈ తరహా చిత్రాలే కదా.
సినిమా ద్వారా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది మనం మర్చిపోయాం. బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు తమకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. అంతిమంగా కథే హీరో. హీరోలు వస్తారు పోతారు సినిమా శాశ్వతంగా మిగిలి ఉంటుంది
తెలుగు, బాలీవుడ్ చిత్రాలకు పెద్ద తేడాలేం లేవు. సినిమా కోసం మేమంతా పడే కష్టం అక్కడా ఇక్కడా ఒక్కటే. ఇక్కడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్లతో నటించాలని కోరుకుంటున్నా