Rajinikanth: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో రేపు (సోమవారం) శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా అయోధ్య బాట పడుతున్నారు. తాజాగా తమిళ సూపర్స్టార్ రజినీకాంత్, తమిళ హీరో ధనుష్ కూడా చెన్నై ఎయిర్పోర్టు నుంచి అయోధ్యకు బయలుదేరారు. రజినీకాంత్, ధనుష్ చెన్నై ఎయిర్పోర్టులోకి వెళ్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Chennai, Tamil Nadu: Actors Rajinikanth and Dhanush leave for Ayodhya to attend the Pran Pratishtha ceremony tomorrow. pic.twitter.com/emB7QkP7gy
— ANI (@ANI) January 21, 2024