ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల లైనప్ను చూస్తే మరో రెండేళ్ల వరకు ఈ అగ్ర హీరో డేట్స్ ఖాళీగా లేనట్లే కనిపిస్తున్నది. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి వరుస చిత్రాలతో ప్రభాస్ క్యాలెండర్ ఫుల్ అయిపోయింది. ‘బాహుబలి’ సిరీస్తో సంపాదించుకున్న పాన్ ఇండియా ఇమేజ్ వల్ల అగ్రశ్రేణి దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ (‘వార్’ ఫేమ్) దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
వీరిద్దరి కాంబినేషన్ మూవీ గురించి చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ షారుఖ్ఖాన్తో ‘పటాన్’, హృతిక్ రోషన్తో ‘ఫైటర్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ కూడా ముందుగా అంగీకరించిన ప్రాజెక్ట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబో పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్నదని సమాచారం. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం.