హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాలోని తొలిగీతం ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ చేశారు. ఈ గీతాన్ని హృతిక్రోషన్, కియారా అద్వాణీలపై చిత్రీకరించారు. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్సింగ్ ఆలపించారు.
అమితాబ్ భట్టాచార్య రచించారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా..’ పాటను రూపొందించిన టీమ్ ఈ గీత రూపకల్పనలో పాలుపంచుకుందని, ‘వార్-2’ మ్యూజికల్గా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ తన స్పైయూనివర్స్లో భాగంగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి.