టాలీవుడ్ (Tollywood) హిస్టరీలో బాక్సాపీస్ను షేక్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోలకు తమ కెరీర్లో ట్రెండ్ సెట్ చేసి..చరిత్ర సృష్టించిన ఆల్టైమ్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలున్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకునేది మహేశ్ బాబు కెరీర్నే మలుపు తిప్పిన పోకిరి. ఇటీవలే మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేయగా..మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది.
ఈ చిత్రం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ (re release)కు శ్రీకారం చుట్టింది. పోకిరి రీరిలీజ్కు వచ్చిన క్రేజ్తో మా హీరో సినిమా కూడా రిలీజ్ కావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు అభిమానులు. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటించిన జల్సా, నాగార్జున నటించిన శివ, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాల రీరిలీజ్ వార్తలు తెరపైకి వచ్చాయి.
అయితే ఇపుడు మాత్రం మూవీ లవర్స్ ను ఎక్జయిటింగ్కు లోను చేసే అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
తాజా న్యూస్ మాత్రం మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర (Indra)ను రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies).
ప్రియమైన మెగాస్టార్ అభిమానులకు..మీరు మాత్రమే కాదు.. మేము కూడా.. ఇంద్ర 4K ప్రింట్ని విడుదల చేస్తాము..కానీ ఇప్పుడే కాదు..కొంత సమయం పడుతుంది.. కానీ రిలీజ్ మాత్రం గ్రాండ్గా ఉండబోతుంది..అంటూ ట్వీట్ చేసింది వైజయంతీ మూవీస్. ఇంకేముంది త్వరలోనే ఇంద్ర సినిమాను మళ్లీ థియేటర్లలో చూడొచ్చన్నమాట.
Dear Megastar Fans ♥️♥️♥️
Not only u.. we are also.. We will be releasing 4K Print of #Indra, but not right now, it takes some time but the release will be in a BIG & GRAND Manner.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 14, 2022