Gangs of Godavari | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను మే 31 విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదలకు ఇంకా 5 రోజులే ఉండడంతో మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. 1990 రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. చీకటి ప్రపంచంలో సామాన్యుడిగా ఉన్న ఓ వ్యక్తి నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది స్టోరీ. ఈ చిత్రంలో విశ్వక్సేన్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో అలరించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్ అంజలి ఈ మూవీలో వైలెంట్ మోడ్లో కనిపించబోతుంది. ఇక గోదావరి బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.