వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రానికి సందీప్ రాజ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో లాయర్ విశ్వామిత్రగా నటించారు. విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్ర లుక్ను విడుదల చేశారు. కథలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని, విశ్వక్ సేన్ అతిథి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద క్రేజ్ పెరిగిందని చిత్రబృందం చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.