శుక్రవారం బిగ్ బాస్ 41వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కొత్త కెప్టెన్ విశ్వ.. ప్రియాంకకు దారుణమైన శిక్ష విధించాడు. రెండు సార్లు మైక్ మరచిపోయిన నేపథ్యంలో మానస్తో లైట్స్ ఆఫ్ అయ్యే వరకూ మాట్లాడొద్దు.. ఓన్లీ సైగలు మాత్రమే చెయ్యాలి అని చెప్పుకొచ్చాడు. దీనికి ప్రియాంక.. ‘ప్లీజ్ అన్నయ్యా నా వీక్ నెస్ మీద కొట్టొద్దు.. నా వల్ల కాదు’ అంటూ చాలా బ్రతిమిలాడినా కూడా విశ్వ ఒప్పుకోలేదు.దీంతో శిక్షకు ఓకే చెప్పింది ప్రియాంక.
ఇక కుక్కర్పై రైస్ ఉడుకుతున్న సమయంలో అది పక్కన పెట్టి బ్లాక్ కాఫీ పెట్టుకుంది శ్వేత.మళ్లీ కుక్కర్ ఆన్ చేయడం మరచిపోయింది. దీనిని గమనించిన ప్రియ.. శ్వేతని సున్నితంగా మందలించింది. నువ్వు కుక్కర్ మళ్లీ పెట్టాలి కదా శ్వేతా.. సగంలో ఆగిపోతే రైస్ బాగుంటుందా చెప్పు?’ అని చురకలు అంటించింది. ఐ విల్ ఐ విల్ అన్న శ్వేత.. ప్రియా లోపలికి వెళ్లాక ఇప్పుడు లంచ్ పెడతారని అనుకుంటామా, అంత టోన్ అవసరం లేదు అంటూ తన బాధను అనీ మాస్టర్ ముందు వ్యక్తపరచింది శ్వేత.
విశ్వ వచ్చి మరోసారి శ్వేతతో అదే విషయం మాట్లాడటంతో.. ‘ఇది లంచ్ టైమా?’ అని ప్రశ్నిస్తుంది. ‘హా రోజు ఇదే టైమ్కి పెట్టేస్తున్నారుగా’ అంటాడు విశ్వ. ‘హో నాకు తెలియదు.. నాది బాత్ రూమ్ టీమ్’ అంటూ లోపలికి వచ్చి.. ప్రియతో వాదనకు దిగుతుంది. ‘ప్రియాగారు.. అక్కడ రైస్ పెట్టారనే విషయం తెలియదు’ అనగానే.. ప్రియా.. ‘తెలియకే చూసుకోవాలి కదా అన్నాను అంతే.. కావాలని ఎవరూ చెయ్యరు కదా..’ అంటుంది ప్రియ.‘అది నాకు తెలుసు కానీ మీ టోన్ నాకు నచ్చలేదు’ అని శ్వేత రివర్స్ అవుతుంది. ఈ విషయం మీద శ్వేత.. ప్రియలకు కాసేపు డిస్కషన్ నడుస్తుంది.