హీరో విశాల్ అనగానే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది యాక్షన్ చిత్రాలే. విశాల్ నుంచి రాబోతున్న తదుపరి పూర్తి యాక్షన్ చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కల్యాణ్ సుబ్రమణ్యం అలంకార్ పాండియన్ సహ నిర్మాత. యూనిట్ ఇప్పటివరకు వెల్లడించిన కంటెంట్తో మాస్ లవర్స్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. షూటింగ్ పూర్తయినట్లు కూడా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ను లాక్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.