విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నందా నిర్మిస్తున్నారు. వినోద్ కుమార్ దర్శకుడు. సునైనా కథానాయిక. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి ఉంది.
ఈ సినిమాలో లాఠీ సహాయంతో విశాల్ ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణ్యన్, సంగీతం: సామ్ సీఎస్, దర్శకత్వం: ఏ.వినోద్.