Vishal | మన హీరోలు గొంతు సవరించుకొని తమ గాత్రంతో అభిమానులను మెప్పించడం కొత్తేమీ కాదు. తెలుగు, తమిళ హీరోలెందరో ఇప్పటికే పాటలు పాడి అభిమానులను అలరించారు. తాజాగా తమిళ హీరో విశాల్ తెలుగులో తొలిసారి ఓ పాట పాడారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంథోని’ తెలుగులో కూడా విడుదల కానుంది.
ఈ సినిమాలో ఓ పాటను ఆలపించారు విశాల్. ‘అదరఅదర’ అంటూ ఫాస్ట్బీట్తో సాగే ఈ పాటకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్నందించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో తొలిసారి పాట పాడటం పట్ల విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాట ప్రోమోను ఆయన సోషల్మీడియాలో పంచుకున్నారు.