‘ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న తరుణంలో సాయిధరమ్తేజ్కు ప్రమాదం రూపంలో చిన్న బ్రేక్ వచ్చింది. ఆ దురదృష్ట ఘటన నుంచి కోలుకొని ఆయన చేసిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. మంగళవారం ‘విరూపాక్ష’ చిత్ర ట్రైలర్ను అల్లు అరవింద్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 21న విడుదలకానుంది. దిల్రాజు మాట్లాడుతూ ‘సాయిధరమ్తేజ్కిది రీఎంట్రీ. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘సాయిధరమ్తేజ్ ప్రమాదం నుంచి కోలుకొని మంచి సినిమాతో మన ముందుకురావడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ ఖాయమనిపిస్తున్నాయి. ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేయడం పెద్ద బలం’ అన్నారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించామని..ట్రైలర్ను దిల్రాజు, అల్లు అరవింద్ చేతులమీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. సాయిధరమ్తేజ్ మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. బ్లాక్బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేను అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిర్మాతలు దిల్రాజు, అరవింద్గారికి కృతజ్ఞతలు’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: సుకుమార్, కెమెరా: శ్యామ్దత్ సైనుద్దీన్, సమర్పణ: బాపినీడు.బి, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, దర్శకత్వం: కార్తీక్ దండు.