కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశి నాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘విలేజ్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్ ఇది. కిరణ్ అబ్బవరం పాత్ర అలరించే విధంగా ఉం టుంది’ అన్నారు.