కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయమమవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం తిరుపతిలో ఈ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నాల్గవ సింగిల్ ‘సోల్ ఆఫ్ తిరుపతి’ అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో పన్నెండు తరాలకు చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించారు. ‘కథానుగుణంగా ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం తిరుపతిలోనే చిత్రీకరించాం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: డేనియల్ విశ్వాస్, సంగీతం: చైతన్ భరద్వాజ్, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు.