వికాస్, వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, అయేషాఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. విశ్వక్సేన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. గంగాధర్ దర్శకుడు. ఎస్కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో సమర్పకుడు ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఓ కొత్త పాయింట్ను ఈ సినిమాలో చర్చించాం. ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. మంచి కథకు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం తోడయిందని, అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా కుదిరిందని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.