Vijay thalapathy | ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి విజయం సాధిస్తే, ఆ హీరో, దర్శకుడి కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అన్ని కుదిరితే ఆ హీరో, దర్శకుడు కూడా సినిమాను చేయడానికి సిద్ధంగా ఉంటారు. సినీరంగంలో ఇప్పటికే అలా ఒక సినిమాతో జర్నీ ఆపకుండా.. రెండు మూడు సినిమాలతో జర్నీ కంటిన్యూ అయిన హీరో, దర్శకుల కాంబోలో ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబో రెండవ సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు. ఆ కాంబో ఎవరా అని ఆలోచిస్తున్నారా? వారెవరో కాదు విజయ్ దలపతి, లోకేష్కనగరాజ్.
వీరి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం విజయ్ కెరీర్లో హైయెస్ట్ షేర్ను సాధించిన సినిమాగా అప్పడు రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మరో సారి ఈ కాంబో పట్టాలెక్కనున్నట్లు తాజాగా జరిగిన అవార్డు ఫంక్షన్లో లోకేష్ కనగరాజ్ చెప్పాడు. గతంలోనే వీళ్ళ కాంబోలో సినిమా రానుందని జోరుగా ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు స్వయంగా లోకేష్ చెప్పడంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దలపతి, వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాతే వీళ్ళకాంబో సెట్స్ పైకి వెళ్ళనుంది.