విజయ్శంకర్, అఘారెడ్డి జంటగా నటించిన చిత్రం ‘ఫోకస్’. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలకపాత్రల్లో నటించారు. జి.సూర్యతేజ దర్శకుడు. వీరభద్రరావు పరిస నిర్మాత. ఈ నెల 28న చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్థ్రిల్లర్గా తెరకెక్కించాం. అఘారెడ్డి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రం తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.