విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న సినిమా ‘లైగర్’. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ప్రెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘లైగర్’ మూవీ మీకెంత స్పెషల్ ?
ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమకు వచ్చాను. నేనూ, దర్శకుడు తరుణ్ భాస్కర్ కలిసి ‘పెళ్లి చూపులు’ సినిమా చేశాం. ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్దాం అనుకునే సమయంలో ‘అర్జున్ రెడి’్డ చిత్రానికి పెద్ద సక్సెస్ ఇచ్చి నాకో మంచి గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలు చెబుదామని వెళ్లేంత ఆత్మవిశ్వాసం అందించారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. ‘లైగర్’ మీద మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నాం. మీరు ఎంజాయ్ చేసే సినిమా ఇవ్వబోతున్నాం.
పూరీ డైలాగ్స్ ఫేమస్. నత్తితో మాట్లాడటం ఇబ్బందిపెట్టిందా?
డైలాగ్స్ కంటే ఇందులో భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు ఎక్కువ ఆకట్టుకుంటాయి. వాట్ లగా దేంగే అనే డైలాగ్ చెప్పేందుకు కష్టపడ్డాను. ఈ సీన్ తర్వాత పాత్రతో కనెక్ట్ అయిపోయా. నత్తితో మాట్లాడటం ఇబ్బంది కాలేదు.
‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాలా ఉంటుందనే పోలికలు వస్తున్నాయి?
ఈ చిత్రానికి ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. నేను రీమేక్లు, గతంలో వచ్చిన సినిమాల తరహా కథల్ని ఎంపికచేసుకోను. ఇందులో తల్లీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది.
ఈ సినిమా కోసం ఎలా సిద్ధమయ్యారు?
నేను శారీరకంగా, మానసికంగా శ్రమించిన చిత్రమిది. దాదాపు 18 నెలలు శరీరాకృతి కోసం కష్టప్డడాను. డ్యాన్యులు చేయాలంటే మాత్రం ఏడుపొస్తుంది. రిహార్సల్స్లో కూడా ఇబ్బంది పడతాను. పూరీ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎలాగోలా డ్యాన్యులు బాగానే చేయగలిగా.
మైక్ టైసన్తో నటించిన అనుభవం ఎలా ఉంది?
మైక్ టైసన్తో ఫైట్ సీన్ చేస్తున్నా అని చెబితే మా అమ్మ భయపడింది. ఆయన్ను కలవగానే నాలోనూ ఆందోళన కలిగింది. కానీ కొద్ది రోజులకే ఆయనతో మంచి స్నేహం ఏర్పడింది.
ఇందులో బాలీవుడ్ తరహా కంటెంట్ ఉందనే ఫీల్ కలుగుతున్నది?
ఇది పక్కా తెలుగు సినిమా. బాలీవుడ్ నుంచి మన సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగు, హిందీలో చిత్రీకరణ జరి పాం. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హిందీ వాళ్లు. రైటింగ్, మేకింగ్ చూసినప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ లా అనిపిస్తుండొచ్చు కానీ ఇది మన సినిమా. థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక్క క్షణం కూ డా ఇది హిందీ సినిమాలా ఉందే అనిపించదు.
దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇంత అభిమానం, ఆదరణ దక్కుతుందని ఊహించారా?
ఇది సంతోషంగా ఉన్నా కొద్దిగా భయం కూడా వేస్తుంటుంది. వాళ్లు నాపై అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను పాన్ ఇండియా సినిమాలు చేయలేదు, హిందీ చిత్రాల్లో నటించలేదు. టూర్ సమయాల్లో నేను ఇతర నగరాల అభిమానులను అడిగాను ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు అని..వాళ్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. నా సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి, యూట్యూబ్, టీవీల్లో ప్రసారం అయ్యాయి. వాటిలో నా నటన నచ్చి అభిమానం పెంచుకున్నారేమో. సోషల్ మీడియా ద్వారా నేను అందరితో కనెక్ట్ కావడం మరో కారణం అనుకుంటా.
మీ గత రెండు చిత్రాలు అపజయం పాలైనా క్రేజ్ తగ్గకపోవడంపై ఎలా స్పందిస్తారు?
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఏదైనా చేయగలను, నాకు నచ్చిన సినిమా చేస్తా అనుకున్నా. కానీ గత కొద్ది రోజులుగా ఇంత ఆదరణ, అభిమానం నా వల్లే రాలేదు, ఏదో ఆశీర్వాదం నాపై పనిచేస్తున్నది అనిపిస్తోంది. గొప్ప చిత్రాల్లో నటించడం ద్వారానే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత చెప్పగలను. ఆ ప్రయత్నంలో తొలి అడుగు ఈ సినిమా.
మీకు వచ్చిన ఈ క్రేజ్, సినిమా మీదున్న అంచనాలు భయపెడుతుంటాయా?
అంచనాలను తప్పకుండా అందుకుంటాం. నేను ‘పెళ్లి చూపులు’ చేసినప్పుడు అది నాకు పెద్ద ప్రాజెక్ట్. దాని తర్వాత గీత గోవిందం, అర్జున్ రెడ్డి ఇలా సినిమాల స్పాన్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ‘లైగర్’ కూడా అంతే. ఈ క్రేజ్ ఎప్పుడూ భయానికి లోనుచేయలేదు.
బాలీవుడ్పై ప్రభావం చూపిస్తున్న తెలుగు స్టార్స్లో చేరానని అనుకుంటున్నారా?
ఇంకా ఆ స్థాయికి రాలేదు. వస్తాననే నమ్మకం ఉంది.
సినిమా హిట్టనే ముందే చెప్పేస్తున్నారు
సినిమా మీదున్న నమ్మకం అది. నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. రమ్యకృష్ణ ‘బాహుబలి’ నుంచి ఉత్తరాది ప్రేక్షకులకు అందరికీ దగ్గరయ్యారు. అనన్య పాండే ఉంది. మా ప్రయత్నమంతా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమే. ఒక్కసారి వాళ్లు వచ్చాక తప్పకుండా సంతృప్తి పడతారు. నేను నా మొదటి సినిమా పెళ్లి చూపులు నుంచే ఇలాగే మాట్లాడుతున్నా. సినిమా బాగుందని అనిపిస్తే విజయం సాధిస్తుందని చెబుతుంటా. మొదట్లో మీడియా నన్ను తిట్టేది. ఇప్పుడే వచ్చాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడు అని. విమర్శలు, ట్రోల్స్ అనేవి నేను యాక్టర్ కానప్పటి నుంచీ ఉన్నాయి. అప్పుడు కాలేజ్లో నీ ర్యాంక్ ఎంత? జీవితంలో ఏం సాధిస్తావు? అని తిట్టేవాళ్లు. విమర్శలను ఎవరూ తప్పించుకోలేరు.
తెలుగు సినిమాలు ఇష్టపడతాను
నేను తెలుగు, తమిళం వంటి దక్షిణాది చిత్రాలు ఎక్కువగా చూస్తుంటా ను. అవి నాకు బాగా నచ్చుతాయి. తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. న్యూఇయర్ రోజునే పూరి వచ్చి కథ చెప్పారు. మంచి జరగబోతున్నది అనిపించింది. తెలుగులో చేస్తున్న తొలి చిత్రమే మాస్, కమర్షియల్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ వంటి వాళ్లతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. విజయ్ దేవరకొండ నాకొక మంచి మిత్రుడు అయ్యారు. ఇటీవల దేశంలోని చాలా నగరాల్లో మా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేని ఫీలింగ్ కలిగిస్తున్నది. తెలుగులో అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నా.
పాన్ ఇండియా సినిమాగా చేయాలని ముందే అనుకున్నారా?
లేదు. పూరీ గారు ఈ కథ చెప్పినప్పుడు తెలుగు సినిమానే తెరకెక్కించాలని అనుకున్నాం. అయితే కథ విన్నాక ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు పాన్ ఇండియా సినిమా చేయొచ్చు కదా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ చిత్రాలు దేశీయంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ‘అర్జున్ రెడి’్డ సినిమా చూశాక కరణ్ జోహార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన దగ్గర ఉన్న కథలు పంపిస్తా అన్నాడు. అలా మా పరిచయంతో ఈ కథ వినకుండానే ప్రాజెక్ట్లో భాగమయ్యారు.