విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న సినిమా ‘దోషి’. మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంతో తెరకెకుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘నా గత చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తే ఈ సినిమాను క్రైమ్ డ్రామా జానర్లో రూపొందించాను. ఇప్పటిదాకా మానవాళి చరిత్రలో జరగని నేర కథగా ఈ చిత్రం ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం.
త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. జగన్, నిళల్ గల్ రవి, జాన్ మహేంద్రన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కన్నన్, సినిమాటోగ్రఫీ : గోపీ అమర్నాథ్.