సాయిరామ్శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత దేవరాజ్ పోతూరు మాట్లాడుతూ ‘చక్కటి ప్రణాళికతో 35రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. దీనివల్ల ప్రొడక్షన్స్ ఖర్చు చాలా తగ్గింది. ఇక ఈ కథలో కడుపుబ్బా నవ్వించే కామెడీ, సెంటిమెంట్ అంశాలుంటాయి.
యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఈ కథ తయారు చేశాడు. కామారెడ్డిలో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి హీరో హైదరాబాద్కు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాం. సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇకముందు కూడా లిమిటెడ్ బడ్జెట్లోనే సినిమాలు చేస్తాను’ అన్నారు.