ముంబై : ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఇస్మాయిల్ ష్రాఫ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. 62 ఏండ్ల ఇస్మాయిల్ ష్రాఫ్ 1980, 90ల్లో పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
గుండె పోటుకు గురైన అనంతరం ఇస్మాయిల్ ష్రాఫ్ గత నెల రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీకి చెందిన ఇస్మాయిల్ అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇస్మాయిల్ మృతి పట్ల బాలీవుడ్ స్టార్ గోవిందా, పద్మిని కొల్హాపురి, అశోక్ పండిట్ సంతాపం తెలిపారు. ఇస్మాయిల్ ష్రాఫ్తో తాను పలు సినిమాలకు కలిసి పనిచేశానని పద్మిని కొల్హాపురి గుర్తుచేసుకున్నారు.
ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే వెరీ సెన్సిటివ్ డైరెక్టర్ ఆయనని ఆమె పేర్కొన్నారు. థోడిసీ బేవఫై, అహిస్ట అహిస్ట వంటి సినిమాల్లో తాను నటించానని చెప్పారు. ఇస్మాయిల్ ష్రాఫ్ జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్ధార్, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝూటా సచ్ వంటి పలు సినిమాలను తెరకెక్కించారు. ఆయన చివరిసారిగా ఆర్య బబ్బర్, శ్రియ నటించిన థోడా తుమ్ బద్లో, థోడా హం 2004లో విడుదలైంది.