నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాతో మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.
ఎంఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి వెన్నెల కిషోర్ నటించిన గుంతలకిడి గురునాథం అనే క్యారెక్టర్ లుక్ను రివీల్ చేశారు. ఈ పాత్రకు ఈగోకా బాప్ అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో అహంకారంతో సాగే పాత్ర ఇదని తెలుస్తున్నది. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల.