‘కిశోర్ ప్రతి విషయంలో అయోమయానికి లోనవుతుంటాడు. అతడి సలహాలతో ఓ ప్రేమికుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు టీజీ కీర్తికుమార్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తున్నారు. కె. రాజశేఖర్రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అతడి లుక్ను శనివారం చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘హీరోను కన్ఫ్యూజ్ చేసే స్నేహితుడిగా వెన్నెల కిశోర్ పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్నాం’ అని చెప్పారు. సుహాసిని మణిరత్నం, మంజుల ఘట్టమనేని ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.