వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. వెంకటేశ్తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఇటీవల కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో వెంకటేశ్ గన్ పట్టుకొని సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు. ‘వెంకటేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.