వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం.47’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ క్రేజీ ఫ్యాష్బ్యాక్ని త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఈ ఘట్టం ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని ఇన్సైడ్ టాక్.
ఈ ఎపిసోడ్లో వెంకటేశ్ దృష్టి లోపం ఉన్న ‘రా ఏజెంట్’గా కనిపిస్తారట. తన కున్న లోపంతో వెంకీ పాత్ర చేసే ఛేజ్లు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటాయని తెలుస్తున్నది. ‘మీర్జాపుర్’ఫేం దివ్యేందుశర్మ ఇందులో తీవ్రవాదిగా నటిస్తున్నారు. శ్రీనిధిశెట్టి కథానాయిక. నికితిన్ ధీర్, రావురమేష్ ఇతర పాత్రధారులు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.