హైదరాబాద్: సీనియర్ నటి జమున మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర స్యభామగా పేరుగాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు ప్రతీకలుగా ఉండేవని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ప్రముఖ నటీమణి శ్రీమతి జమున గారు పరమపదించారని తెలిసి విచారించాను. వెండితెర సత్యభామగా పేరు గాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు ప్రతీకలుగా ఉండేవి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/dXcLMick44
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 27, 2023
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రతిభాశాలి జమున అని పవర్స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. తన నటనతో సత్యభామ పాత్రకు జీవం పోశారని చెప్పారు. జమున మృతిపట్ల ప్రిన్ మహేశ్ బాబు విచారం వ్యక్తం చేశారు.
Saddened to hear about the demise of #Jamuna garu. Will fondly remember her for all her iconic roles and her immense contribution to the industry. My condolences to her family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) January 27, 2023
తెలుగు చిత్ర పరిశ్రమలో 30 ఏండ్లపాటు జమున మహారాణిలా కొనసాగారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. వైవిధ్యమైన పాత్రలతో మనసుల్లో చెరగని ముద్రవేశారని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని తెలిపారు. జమున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు.
మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ImmYbmBFl0
— Jr NTR (@tarak9999) January 27, 2023
సీనియర్ నటి జమున మృతి పట్ల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సంతాపం వ్యక్తంచేశారు. వెండితెర సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న నటీమణి, రాజకీయ నాయకురాలు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.