హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఆరో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు చిత్రాల విడుదల రోజున ఉదయం 4 గంటల ఆటకు అనుమతులు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నెల 13న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం విడుదల కానున్నది. ఆయా చిత్రాలు విడుదల రోజున ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇచ్చింది.