Veera Simha Reddy Movie | ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
స్వర మాంత్రికుడు ఎస్.ఎస్ థమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను ప్రకటించాడు. త్వరలోనే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేసాడు. ‘అఖండ’ మ్యాజిక్ రిపీటవుతుంది అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతలకు రూ.140 కోట్ల వరకు వచ్చాయని టాక్.
#VeeraSimhaaReddy FIRST SINGLE SOON 🔥
— thaman S (@MusicThaman) November 22, 2022