వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకుడు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో రెట్రో ైస్టెల్లో తెరకెక్కించిన రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘కూర్చుంటే ఏదీ రాదు.. తలబడితే నీదే దునియా అంతా..’ అంటూ భాస్కరభట్ల రాసిన ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ స్వరపచగా, మనో ఆలపించారు.
వరుణ్తేజ్ ఈ పాటలో రెట్రోలుక్లో ైస్టెలిష్గా కనిపించారు. ఓ సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం నేపథ్యంలో సాగే కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని, 1980-90 దశకంలో కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.