వరుణ్ తేజ్ హీరోగా తన 13వ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ తార మానుషీ చిల్లర్ నాయికగా నటిస్తున్నది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ రాడార్ ఆఫీసర్గా ఆమె కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. భారత వాయుసేన సాహసాల నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్సింగ్ హడా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్ ముద్దా నిర్మాత. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. యుద్ధ క్షేత్రంలో మన వాయుసేన వీరుల సాహసాన్ని చూపించనుందీ సినిమా. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు.