షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్లో కూడా అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అట్లీ. గత ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ‘జవాన్’ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అట్లీ హిందీలో వరుణ్ధావన్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్లో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లింది.
త్వరలో టీజర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘బేబీ జాన్’ అనే టైటిల్ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది. అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన ‘తేరి’ చిత్రానికి రీమేక్ ఇది. కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాలిస్ దర్శకత్వం వహిస్తుండగా అట్లీ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాతగా తనకిది తొలి సినిమా కావడంతో అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.