వరుణ్ ధవన్, కృతిససన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భేడియా (Bhediya). తెలుగులో తోడేలు (Thodelu) టైటిల్తో విడుదలవుతుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఫైనల్ చేశారు.
నవంబర్ 19న హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో రాత్రి 9 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈవెంట్లో చిత్రయూనిట్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడ్డాక్ ఫిలిమ్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ హార్రర్ కామెడీ సినిమా హిందీ, తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల కానుంది.
భేడియా అరుణాచల్ అడవుల నేపథ్యంలో సాగే కథ. ఆ ప్రాంతంలో ఉండే భాస్కర్ అనే వ్యక్తి తోడేలు కాటుకు గురైన తర్వాత భయంకరమైన రూపంలోకి ట్రాన్స్ ఫార్మేషన్ అవడం, ఆ తర్వాత స్నేహితులు అతడి సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే కథతో సినిమా సాగనుంది.
Beware: The #Thodelu 🐺 is coming for you in just 7 days!#7DaysToThodelu, Grand Release on Nov 25th! 💥
Trailer: https://t.co/W0vltfosaV @Varun_dvn @kritisanon #AmarKaushik #DineshVijan @nirenbhatt @sachinjigarlive @MaddockFilms @jiostudios @ZeeMusicCompany @AlluEnts pic.twitter.com/OZksJYmNFx— Geetha Arts (@GeethaArts) November 18, 2022
భేడియా ట్రైలర్.