Urvashi Rautela | బాస్ పార్టీ అంటూ వాల్తేరులో వయ్యారాలు ఒలికించిన భామ ఊర్వశి రౌతేలా నిమిషానికి అక్షరాల కోటి రూపాయలు తీసుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ భామనే ఒప్పుకోవడం విశేషం. తాజాగా ఓ రిపోర్టర్ ఊర్వశి ముందు మైక్ పెట్టి మీరు నిమిషానికి రూ.కోటి వసూలు చేస్తారట.. ఇండియాలోనే అత్యధిక మొత్తం అందుకునే హీరోయిన్ అట.. దీనిపై ఎలా ఫీలవుతున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా ఊర్వశి స్పందిస్తూ ‘ఇది చాలా మంచి విషయం. తనలా స్వశక్తితో నటిగా ఎదిగిన ఎవరైనా ఇలాంటి రోజు ఒకటి చూడాలి’ అంటూ ఊర్వశి చెప్పుకొచ్చింది. దాంతో ఈ అమ్మడు ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయింది.
నిమిషానికి కోటి రూపాయలా? అసలు ఎవరిస్తున్నారంటూ ఊర్వశిని తెగ ట్రోల్ చేస్తున్నారట. అబద్దం ఆడితే అతికినట్లుండాలి కానీ మరీ ఇలా ఉండకూడదని విమర్శిస్తున్నారు. పైగా ఈ మధ్య అసలు మేయిన్ హీరోయిన్గా సినిమాలే చేయట్లేదు. కేవలం ఐటెంగర్ల్గా మారిపోయింది. అలాంటప్పుడు అంత రెమ్యునరేషన్ ఎవరిస్తున్నారిని కామెంట్స్ చేస్తున్నారు. దీపికా, ఆలియాభట్ల వంటి స్టార్ హీరోయిన్లే నెలలు తరబడి సినిమాలు చేసిన పట్టు మని పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. అలాంటిది నిమిషానికి కోటీ సంపాదిస్తున్నావని పచ్చిగా అబ్బదం ఎలా చెబుతున్నావని మరి కొందరు తెలుపుతున్నారు.
ఇక ఊర్వశి ఈ మధ్య టాలీవుడ్ సినిమాల్లో తెగ సందడి చేస్తుంది. ఐటెం పాట అంటే చాలు ఈమెనే ఆప్షన్ అయిపోయింది. వాల్తేరులో బాస్ పార్టీ, ఏజెంట్లో వైల్డ్ సాలే, బ్రో సినిమాలో మై డియర్ మార్కండేయా ఇలా స్టార్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తుంది. వినాయక చవితికి రిలీజయ్యే స్కందలోనూ ఊర్వశి ఓ ఐటెం పాటలో నర్తించింది.