టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో రామ్ చరణ్ – ఉపాసన జంట తప్పక ఉంటుంది. వీరి వివాహం జరిగి 8 ఏళ్లు అవుతున్నప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అయితే కొన్నాళ్లుగా వీరిని ఓ ప్రశ్న వెంటాడుతుంది. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. వాటిని రామ్ చరణ్, ఉపాసన చాలా లైట్ తీసుకుంటూ వస్తున్నారు. తాజగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పిల్లల విషయంకి సంబంధించి ఎదురైన ప్రశ్నపై నోరు విప్పింది.
పిల్లల్ని ఎప్పుడు కనాలి అనేది నా పర్సనల్. నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను. సోషల్ మీడియాలో ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడిన అది మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అది ఇది అని రాస్తారు. అనుకునే వాళ్లు ఏదైనా అనుకోనివ్వండి.. నేను దీనికి సమాధానం చెప్పను. మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది నా పర్సనల్ లైఫ్. ఆ సమయం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతాను.
ఇప్పుడు మనం కరోనా కష్టకాలంలో ఉన్నాం. ఒకరికొకరు సాయపడాల్సిన సమయం’ అని ఉపాసన చెప్పుకొచ్చింది. కాగా, 8 ఏళ్ల తమ వివాహా బంధంలో మేమిద్దరం ఎన్నోసార్లు గొడవలు పడ్డాం. మా మధ్య వచ్చిన గొడవలన్ని చిలిపి తగాదాలేనని ప్రేమికుల రోజు ఉపాసన చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.