19మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో తొలివారం సరయు ఎలిమినేట్ అయింది. ఇక రెండో వారం నామినేషన్లో కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉండగా శనివారం రోజు లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్లని నాగార్జున సేవ్ చేశారు. మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది.
తాజా సమాచారం మేరకు కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి ఎలిమినేట్ కానుంది. అందరి కంటే ఉమాకే ఓట్స్ తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయిందని అంటున్నారు. మొదట్లో అందరిపై అరిచేసి నానా రచ్చ చేసిన ఉమాదేవి ఈ మధ్య లోబోతో కలిసి తెగ నవ్విస్తుంది. వీరిద్దరు మధ్య సాగుతున్న ప్రేమ ముచ్చట్లు ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నాయి.
రీసెంట్గా జరిగిన నామినేషన్లో ఉమా దేవి బూతులు మాట్లాడింది. ఇది ఆమెకు కొంత నెగెటివిటీని తెచ్చి పెట్టింది. ఆ మధ్య ప్రియాంకపై నోరు పారేసుకోవడం కూడా ఉమా దేవి ఎలిమినేట్ అయ్యేలా చేసిందని అంటున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్లో బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది తెలియనుంది.